Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ హైవేలో కనిపించిన చిరుతపులి.. అడవుల్లోకి వెళ్ళిపోయింది..

Webdunia
శనివారం, 16 మే 2020 (10:13 IST)
హైదరాబాద్‌ హైవేలో పడివున్న చిరుత పులి ఆపై కనిపించకుండా పోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చిరుత ఆచూకీ కోసం అటవీ శాఖాధికారులు వెతుకులాట ప్రారంభించారు. రెండు రోజులుగాచిరుత జాడ కోసం వెతికినా కనిపించలేదన్నారు. 
 
మూడు బృందాలుగా ఏర్పడి కెమెరాలు, డ్రోన్లతో కూడా గాలించారు. చివరకు హిమాయత్ సాగర్ వద్ద ఉన్నట్టు తేలడంతో అక్కడికి వెళ్లి దాని అడుగుల కదలికల ఆధారంగా అడవిలోకి వెళ్లిందని చెప్పారు. ముందు జాగ్రత్తగా బోన్లు, వలలు కూడా ఏర్పాటు చేశారు. చిలుకూరు వైపు ఎక్కువగా ఫాం హౌజులు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర శివారుల్లో హడలెత్తించిన చిరుత మరోసారి కనిపించింది. రాజేంద్రనగర్‌లోని హిమాయత్ సాగర్ వద్ద నీళ్లు తాగుతుండగా స్థానిక మత్సకారులు చూసి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుత ఆనావాళ్లను సేకరించారు. దీని ఆధారంగా అది చిలుకూరులోని అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు చెబుతున్నారు. 
 
అటవీ మార్గం పట్టడంతో నగర వాసులు ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. అయితే చిరుత పూర్తిగా అడవిలోకి వెళ్లిపోయే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments