Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప నడిబొడ్డున న్యాయవాది అనుమానాస్పద మృతి... హత్యేనా...?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (12:06 IST)
తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదులు వరుసగా హత్యకు గురవుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వామనరావు అనే న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇపుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నడిబొడ్డున ఓ న్యాయవాది అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు కలకలం రేపుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే రాజారెడ్డి వీధికి చెందిన‌ న్యాయవాది పి.సుబ్రమణ్యం గ‌త‌ రాత్రి తన ఇంటి నుంచి పాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు ఫోన్ చేయ‌గా ఆయ‌న సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉంద‌ని వారికి తెలిసింది.
 
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు అ సుబ్రమణ్యం పాత అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లి ఆయ‌న కోసం వెతికారు. అక్కడే సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పులు ఉన్నాయి కానీ, మ‌నిషి లేక‌పోవ‌డంతో అపార్ట్‌మెంట్ ప‌రిస‌రాల్లో గాలించారు.
 
అపార్ట్‌మెంట్‌ కింద సుబ్రమణ్యం మృత‌దేహం రక్తపు మడుగులో పడి ఉండ‌డాన్ని చూసిన పోలీసులు ఆయ‌న‌ మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఆయ‌న‌ను ఎవ‌రైనా హత్యా చేశారా? లేక ఆయ‌న‌ ఆత్మహత్యకు పాల్పడ్డా‌? అన్న విష‌యంపై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments