Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి అద్దె అడిగాడనీ యజమానిని కొట్టి చంపేశారు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (11:22 IST)
ఇటీవలి కాలంలో అకారణంగానే కొందరు దారుణ నేరాలకు పాల్పడున్నారు. క్షణికావేశంలో చేస్తున్న ఈ హత్యల తర్వాత ముద్దాయిలు జీవితాంతం బాధపడుతుంటే, తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుతోంది. 
 
తాజాగా వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో తన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని కిరాయి అడిగినందుకు యజమాని హత్యకు గురయ్యాడు. ముచ్చర్లవారి వీధిలోని వంగా ప్రసాద్‌(50) అనే వ్యక్తి ఇంట్లో ఒక యేడాదిగా చినకొండయ్య అనే వ్యక్తి కుటుంబం అద్దెకు ఉంటోంది. చినకొండయ్య రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. 
 
ఈ విషయమై ఇంటి యాజమాని, చిన కొండయ్య మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన చినకొండయ్య పక్కనే ఉన్న రాయితో యజమాని తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం చినకొండయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments