భవానీ మండల దీక్షా స్వీకరణ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (18:41 IST)
కార్తీక శుద్ధ ఏకాదశి రోజున దేవస్థానము నందు శ్రీ అమ్మవారి భవానీ మండల దీక్షా స్వీకరణ కార్యక్రమము ప్రారంభించబడినది.

ఉదయం 6 గం.లకు శ్రీ అమ్మవారి ప్రధాన ఉత్సవమూర్తులను మహామండపము 6వ అంతస్తుకు తీసుకువచ్చి స్థాపన చేశారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యములో కార్యనిర్వహణాధికారి ఎంవి సురేష్ బాబు దంపతులు ప్రధమముగా విఘ్నేశ్వర పూజ చేసి, ఋత్విక్ వరుణ ఇచ్చి మాలాధారణ కార్యక్రమమును ప్రారంభం చేశారు.

భవానీ భక్తుల సౌకర్యార్థము దేవస్థానము వారు అన్నదానము నందు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమము నందు ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చక సిబ్బంది, ఫెస్టివల్ విభాగము సహాయ కార్యనిర్వహణాధికారి వారు మరియు సిబ్బంది, పలు ప్రాంతములకు చెందిన గురుభవానీలు, వందలాది భవానీ మాల దీక్ష స్వీకరించు భక్తులు పాల్గొన్నారు. 

శ్రీ అమ్మవారి భవానీ మండల దీక్షా స్వీకరణ కార్యక్రమము కార్తీక శుద్ధ ఏకాదశి ది.08-11-2019 నుండి కార్తీక పౌర్ణమి ది.12-11-2019 వరకు ఐదు రోజుల పాటు జరుగునని ఆలయ స్థానాచార్యుల వారు ఒక ప్రకటన తెలిపినారు. అలాగే అర్థ మండల(21 రోజులు) దీక్ష స్వీకరణ కార్యక్రమము ఈనెల 28-11-2019 నుండి 01-12-2019 వరకు జరుగునని తెలిపారు.

కలశ జ్యోతి ఉత్సవములు డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు సత్యనారాయణపురంలోని శివరామ క్షేత్రం నుండి జ్యోతులు ప్రారంభమగునని తెలిపారు.

అనంతరం గిరిప్రదక్షిణ, దీక్ష విరమణ, చండీయాగం డిసెంబర్ 18వ తారీకు నుండి 22 వరకు జరుగునని, ది.22-12-2019 మార్గశిర బహుళ ఏకాదశి రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమము జరుగునని తెలిపారు.

ఈ రోజు ఉదయము వందల సంఖ్యలో భవానీ భక్తులు “జై భవానీ..జై జై భవానీ” నామస్మరణతో దేవస్థానము నందు మండల దీక్ష స్వీకరణ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments