Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ, కాకినాడ తీరంలో భారత్-అమెరికా సైనిక విన్యాసాలు

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (18:36 IST)
అరుదైన సైనిక విన్యాసాలకు విశాఖ, కాకినాడ సాగర తీరం వేదిక కాబోతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏపీలోని సాగర జలాల్లో.. అమెరికా, భారత్‌‌లు సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.

ఈ నెల 13 నుంచి మొదలయ్యే ఈ విన్యాసాలు 8 రోజుల పాటు కొనసాగనున్నాయి. విశాఖలోని తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ, కాకినాడ తీరాల్లో విన్యాసాలు నిర్వహించనున్నారు.

500 మంది అమెరికన్‌ మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్, భారత దేశపు త్రివిధ దళాలకు చెందిన 1,200 మంది ఈ విన్యాసాల్లో భాగస్వాములుకానున్నారు. అలాగే భారత్‌, యూఎస్‌ఎస్‌ జర్మన్‌ టౌన్‌ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకోనున్నాయి.
 
‘టైగర్‌ ట్రయాంఫ్‌’పేరుతో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక విన్యాసాలను ఇండో, పసిఫిక్‌ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఉపయోగపడతాయని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచ దేశాలకు సవాల్ విసరుతున్న ఉగ్రవాదాన్ని అణిచివసేందుకు, టెర్రరిస్టులను హెచ్చరిస్తూ.. ఇండో, అమెరికా ఆయుధ సంపత్తి ద్వారా సత్తా చాటేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇంతకు ముందే భారత్, అమెరికాలు సంయుక్తంగా వివిధ దేశాలతో కలిసి యూఎస్‌–ఏషియన్ ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments