Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లామే కదా అని ముద్దుపెట్టుకోబోయాడు.. అంతే నాలుకను కొరికేసింది..

Webdunia
శనివారం, 22 జులై 2023 (12:52 IST)
పెళ్లామే కదా అని బలవంతంగా ముద్దుపెట్టుకోవాలనుకున్నాడు. కానీ అతనికి చుక్కలు కనిపించాయి. తనను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన భర్త నాలుకను అమాంతం కొరికేసింది ఆతని భార్య. ఈ ఘటన 
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గుట్టతండాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తారాచంద్ నాయక్, పుష్పవతి దంపతులు వీరు 2015లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
గురువారం ఇలా జరిగిన గొడవను సద్దుమణిగేలా చేసేందుకు భార్యకు ముద్దివ్వడమే మంచి మార్గం అంటూ తారాచంద్ భావించాడు. ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే పిచ్చి కోపంలో ఉన్న ఆమె ఒక్కసారిగా భర్త నాలుకను కొరికిపడేసింది. దీంతో తారాచంద్ లబోదిబోమంటూ గుర్తి ఆసుపత్రికి పరిగెట్టారు. 
 
అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ దర్యాప్తులో తారాచంద్ భార్య ప్రవర్తన సరిలేదని.. వేరొక వ్యక్తితో ఆమెకు సంబంధం వున్నట్లు ఆరోపించాడు. పుష్పవతి కూడా భర్త బలవంతంగా ముద్దుపెట్టాలని ప్రయత్నించాడని.. అందుకే అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగలేదు. భర్తపై ఫిర్యాదు కూడా చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments