Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో పట్టపగలే రెచ్చిపోయిన వేటగాళ్లు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (14:28 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ఆందోనీ మండలం నారాయణపురం గ్రామం పొలాల్లో వేటగాళ్లు పట్టపగలే రెచ్చిపోయారు. ఈ గ్రామ పొలాల్లో తిరిగే జింకల మందపై తుపాకులతో విరుచుకపడ్డారు. దీంతో వేటగాళ్ల తుపాకీ తూటాలకు ఏకంగా 12 జింకలు మృత్యువాతపడ్డాయి. వేటగాళ్లు దుండగులు జీప్‌లో వచ్చి తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో జింకల మందపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తుపాకీ తూటాలు తగిన జింకలు నేలకొరిగాయి. 
 
ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న కత్తులతై జింకల తలలను వేరు చేసి మిగిలిన మొండెంతో పారిపోయారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీ ఆదివారం జరిగింది. ఈ వేటగాళ్ళ దుశ్యర్యలను చూసిన గ్రామస్తులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు హుటాహుటిన అక్కడకు వచ్చి మొండెం నుంచి వేరు చేసిన జింకల తలలను స్వాధీనం చేసుకున్నారు. పట్టపగలే వేటగాళ్లు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments