కర్నూలు జిల్లాలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (13:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడుని కర్నూలు పట్టణ పరిధిలోని వెంకటరమణ కాలనీకి చెందిన రాఘవరెడ్డిగా గుర్తించారు. ఈయన తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా పదోన్నతి రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 
 
కాగా, మృతుడు కర్నూలు జిల్లాలోలని ఈ-కాప్ విభాగంలో విధులు నిర్వహించే రాఘవరెడ్డిగా గుర్తించారు. ఈయన వెంకటరమణ కాలనీలోని అక్షయ కాలనీలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఇంట్లో పురుగుల మందు తాగి బయటకు వచ్చి లిఫ్టు వద్ద పడిపోయివున్నాడు. దీన్ని గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆయన్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు వెల్లడించారు. 
 
ఈయన అనంతపురం జిల్లా నల్లమాడ మండలం నల్ల సింగాయగారి పల్లెకు చెందిన రాఘవరెడ్డి 1991 బ్యాచ్‌కు చెందిన ఎస్.ఐ. వివిధ కారణాల రీత్యా ఆయన పదోన్నతులు పొందలేకపోయారు. ప్రస్తుతం ఈ-కాప్ విభాగంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Niharika Konidela: రాకాస తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం : నిహారిక కొణిదెల

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments