Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని బలవన్మరణం

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (06:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పునాదిపాడులోని శ్రీచైతన్య కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని అనంతపురం జిల్లాకు చెందిన లాస్యశ్రీగా గుర్తించారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురానికి చెందిన దాసరి లాస్యశ్రీ (16) అనే యువతి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఆమె రాత్రి స్నేహితులతో కలిసి భోజనం చేసిన తర్వాత తన గదికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
దీన్ని గమనించిన సహచర విద్యార్థులు హాస్టల్ వార్డన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వార్డెన్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... లాస్యశ్రీని పోరంకిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 
 
ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గారావు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments