Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పబ్జి గేమ్‌తో రెండు గ్రామాల మధ్య గొడవ.. కర్రలతో కొట్టుకుంటున్నారట!

పబ్జి గేమ్‌తో రెండు గ్రామాల మధ్య గొడవ.. కర్రలతో కొట్టుకుంటున్నారట!
, బుధవారం, 3 మార్చి 2021 (10:22 IST)
భారతదేశంలో పబ్జి గేమ్ బ్యాన్ చేసినా సరే చాలా మంది వివిధ రకాల టెక్నాలజీలు ఉపయోగించి పబ్జి గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు సదరు పబ్జి గేమ్ కృష్ణా జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఘర్షణకు కారణమైంది. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ పబ్జి వలన ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సులో ఘర్షణకు దిగినట్లు చెబుతున్నారు.
 
ఈ ఘర్షణ పెద్దది కావడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణగా మారిందని చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోని కొత్తూరు తండా అలాగే సిద్ధార్థ నగర్ గ్రామాల మధ్య ఈ వివాదం మొదలైంది. కర్రలు రాళ్లతో పరస్పరం రెండు గ్రామాల మధ్య దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పబ్జి ఆడే సమయంలో ఒకరినొకరు దూషించుకున్న కారణంగా ఈ వివాదం మొదలైంది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిట్లర్ మీసంలా వుంది.. నెటిజన్ల కామెంట్స్.. లోగోను అమేజాన్ మార్చేసిందిగా!