బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత... త్వరలో జేసీ దివాకర్ రెడ్డి కూడా...

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (16:54 IST)
అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత పార్టీ మారిపోయారు. ఆమె తన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండుపా కప్పుకున్నారు. పైగా, తాను స్థాపించిన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. 
 
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆహ్వానం మేరకు ఆమె బీజేపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన గీత ఎంపీగా గెలుపొందారు. అనంతరం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె... సొంతంగా జనజాగృతి అనే పార్టీని గత ఏడాది స్థాపించారు.
 
ఈ సందర్భంగా అమిత్ షా, రాంమాధవ్‌లకు ట్విట్టర్ ద్వారా గీత ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ వేదికగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అమిత్ షా నాయకత్వంలో పార్టీ ఉన్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని అన్నారు.
 
మరోవైపు, టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై ఇప్పటికే విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అదేసమయంలో ఈ ప్రచారంపై జేసీ దివాకర్ రెడ్డి కూడా స్పందించడం లేదు. ఖండించడం కూడా లేదు. ఫలితంగా ఆయన బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments