Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత... త్వరలో జేసీ దివాకర్ రెడ్డి కూడా...

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (16:54 IST)
అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత పార్టీ మారిపోయారు. ఆమె తన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండుపా కప్పుకున్నారు. పైగా, తాను స్థాపించిన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. 
 
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆహ్వానం మేరకు ఆమె బీజేపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన గీత ఎంపీగా గెలుపొందారు. అనంతరం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె... సొంతంగా జనజాగృతి అనే పార్టీని గత ఏడాది స్థాపించారు.
 
ఈ సందర్భంగా అమిత్ షా, రాంమాధవ్‌లకు ట్విట్టర్ ద్వారా గీత ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ వేదికగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అమిత్ షా నాయకత్వంలో పార్టీ ఉన్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని అన్నారు.
 
మరోవైపు, టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై ఇప్పటికే విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అదేసమయంలో ఈ ప్రచారంపై జేసీ దివాకర్ రెడ్డి కూడా స్పందించడం లేదు. ఖండించడం కూడా లేదు. ఫలితంగా ఆయన బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments