Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో ఎన్.ఐ.ఏ కోర్టులో సీఎం జగన్ పీఏ

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (17:02 IST)
తనపై కోడి కత్తితో దాడి చేసిన కేసులో బాధితుడుగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. గత 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్‍‌పై కోడికత్తితో దాడి చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసు విచారణలో భాగంగా, కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరిన విషయం తెల్సిందే. ఆయన వినతికి సానుకూలంగా కోర్టు సానుకూలంగా స్పందించడంతో ఆయన తరపున పీఏ కె.నాగేశ్వర రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
 
 
 
కాగా, గత 2018 అక్టోబరు నెలలో విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఎయిర్‌పోర్టులోని ఒక రెస్టారెంట్‌లో పని చేస్తున్న శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ కోడిగత్తి గాయంతోనే జగన్ నేరుగా హైదరాబాద్ నగరానికి చేరుకుని ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన వ్యక్తిగత పీఏ కోర్టుకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments