Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి మాల ముసుగులో టీడీపీ నేతపై దాడి...

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (11:54 IST)
కాకినాడ జిల్లాలోని తునిలో దారుణం జరిగింది. స్వామి మాల ముసుగులో ఓ దుండగుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేతపై దాడి జరిగింది. బాధితుడు మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరి రావు. ఈయనపై హత్యాయత్నం జరిగింది. 
 
స్వామి మాల వేసుకున్న దుండగుడు భిక్ష తీసుకుంటున్న సమంయలో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరి రావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు తల, చేతికి బలమైన కత్తిగాయాలయ్యాయి. ఈ దాడిని గమనించిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి తర్వాత దుండగుడు బైకుపై పరారయ్యాడు. 
 
సమాచారం అందుకున్న తుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, ఆ దాడివార్త తెలుసుకున్న పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప తదితరులు ఆస్పత్రికి వెళ్లి శేషగిరిరావును పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments