Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి మాల ముసుగులో టీడీపీ నేతపై దాడి...

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (11:54 IST)
కాకినాడ జిల్లాలోని తునిలో దారుణం జరిగింది. స్వామి మాల ముసుగులో ఓ దుండగుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేతపై దాడి జరిగింది. బాధితుడు మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరి రావు. ఈయనపై హత్యాయత్నం జరిగింది. 
 
స్వామి మాల వేసుకున్న దుండగుడు భిక్ష తీసుకుంటున్న సమంయలో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరి రావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు తల, చేతికి బలమైన కత్తిగాయాలయ్యాయి. ఈ దాడిని గమనించిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి తర్వాత దుండగుడు బైకుపై పరారయ్యాడు. 
 
సమాచారం అందుకున్న తుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, ఆ దాడివార్త తెలుసుకున్న పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప తదితరులు ఆస్పత్రికి వెళ్లి శేషగిరిరావును పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments