Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీటింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రికి అరెస్టు అరెస్టు

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (10:41 IST)
ఒక చీటింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న నిశిత్ ప్రామాణిక్‌కు బెంగాల్ కోర్టు ఒకటి అరెస్టు వారెంట్ జారీచేసింది. బెంగాల్‌లోని అలీపూర్‌దువార్ రైల్వే స్టేషన్ పరిధిలో బంగారం దుకాణంలో, బీర్‌పాడాలోని రెండు బంగారు దుకాణాల్లో 2009లో చోరీ జరిగింది. ఈ కేసుల్లో ప్రామాణిక్‌తో పాటు మరో వ్యక్తి నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారణ గత 13 యేళ్లుగా సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో అలీపూర్‌దువార్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఈ కేసును విచారించి కేంద్ర మంత్రికి అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ వారెంట్ జారీ నేపథ్యంలో తమ తదుపరి చర్య ఏంటో ప్రామాణిక్ తరపు న్యాయవాది దులాల్ ఘోష్ వెల్లడించేందుకు నిరాకరించారు. 
 
కాగా, బెంగాల్ హైకోర్టు ఆదేశం మేరకు ఉత్తర 24 పరగణాల జిల్లా ఎంపీ/ఎమ్మెల్యేల కోర్టు నుంచి ఈ కేసును అలీపూర్‌దువార్ కోర్టుకు బదిలీ చేశారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రామాణిక్ గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చోటు దక్కింది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments