Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (08:47 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. మదనపల్లి ఫైళ్ళ దహనం కేసులో ఆయన ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రధాన కుట్రదారుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. గత ఆరు నెలలుగా ముందస్తు బెయిలుపై ఉండగా, ఆ బెయిల్‌‍ను రద్దు చేయించిమరీ సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉన్నట్టు వచ్చిన పక్కా సమాచారంతో సిట్ పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. 
 
ఆయన పెద్దగొట్టిగల్లులో కళ్యాణ మండపం నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. దీంతో కళ్యాణ మండపం అద్దెకు కావాలంటూ సీఐడీ డీఎస్పీ కొండయ్య నాయుడు బృందం ఆరా తీస్తూ మాధవరెడ్డిని ఆచూకీ గుర్తించి, వలపన్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో మాధవరెడ్డి తన మొబైల్ ఫోన్లను నీటిలో పడేసేందుకు ప్రయత్నించగా, చాకచక్యంగా డీఎస్పీ పట్టుకుని తిరుపతికి తరలించారు. ఆయన నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గత యేడాది జూలై 21వ తేదీన మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనలో ప్రధాన కుట్రదారుడుగా మాధవరెడ్డి ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments