Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

ఠాగూర్
బుధవారం, 15 మే 2024 (22:50 IST)
నెల్లూరు జిల్లా కావలి నియోజవర్గంలో ఆసక్తికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13వ తేదీన ఏపీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కావలి నియోజవర్గ వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఆయన పొరపాటున టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థికి ఓటు వేశారు. ఈ విషయాన్ని ఆయన గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైకాపా తరపున విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారు. అయితే, పోలింగ్ రోజున వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప రెడ్డి పొరపాటున టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేశారు. పోలింగ్ సిబ్బందికి అభివాదం చేస్తూ పొరపాటుగా సైకిల్ గుర్తు బటన్‌ను నొక్కారు. ఆ వెంటనే తాను చేసిన పొరపాటును గ్రహించి పోలింగ్ సిబ్బందికి విషయం తెలుపడంతో, తామేం చేయలేమని సిబ్బంది చెప్పారు. ఇక చేసేదేం లేక ఆయన బయటకు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments