Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

ఠాగూర్
బుధవారం, 15 మే 2024 (22:50 IST)
నెల్లూరు జిల్లా కావలి నియోజవర్గంలో ఆసక్తికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13వ తేదీన ఏపీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కావలి నియోజవర్గ వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఆయన పొరపాటున టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థికి ఓటు వేశారు. ఈ విషయాన్ని ఆయన గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైకాపా తరపున విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారు. అయితే, పోలింగ్ రోజున వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప రెడ్డి పొరపాటున టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేశారు. పోలింగ్ సిబ్బందికి అభివాదం చేస్తూ పొరపాటుగా సైకిల్ గుర్తు బటన్‌ను నొక్కారు. ఆ వెంటనే తాను చేసిన పొరపాటును గ్రహించి పోలింగ్ సిబ్బందికి విషయం తెలుపడంతో, తామేం చేయలేమని సిబ్బంది చెప్పారు. ఇక చేసేదేం లేక ఆయన బయటకు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

పుష్ప జాతర సీన్ కు మించి కొత్తపల్లిలోఒకప్పుడు చిత్రంలో వుంది : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

సుబోధ్ భావే తో ఆదిత్య ఓం తెరకెక్కించిన సంత్ తుకారాం సిద్ధమైంది

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments