Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్ఞాతంలోకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (22:16 IST)
నిన్నటి వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో బిజీగా గడిపిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వ్యక్తిగత సెక్యూరిటీకి కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అయన భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎంపీ సంజయ్ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ రావడంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు.
 
తన ప్రచారంలో రాళ్ల దాడి జరిగిందని బండి సంజయ్‌ చెబుతుండగా అలాంటిది ఏమీలేదని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. కాగా నిన్న రాత్రి బీజేపీ అభ్యర్థిపై తెరాస దాడి చేయగా ఆ విషయమై పోలీసులతో చర్చించగా వివాదం మరింత ముదిరిందని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
ఉదయం గాయపడిన కార్యకర్తని ప్రభుత్వాసుపత్రికి ద్విచక్ర వాహనంపై వెళ్లి పరామర్శించిన ఎంపి బండి సంజయ్ తరువాత ఫోన్లో ఎవరికి అందుబాటులో లేకపోవడం కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 

కాగా ఆయనకు భద్రత కల్పిస్తానన్నా, ఆయన వద్దని వారించడం, గతంలో పార్లమెంట్లో పోలీసులు తనపై దాడి చేశారని ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడంతో గత కొద్దిరోజులుగా పోలీసులకు ఎంపీకి మధ్య వివాదం ముదురుతుండటం గమనార్హం. ఈ నేపధ్యంలో సంజయ్ విశ్రాంతి కొరకు అన్నిటికి దూరంగా వెల్లడా లేక పోలీసులతో వివాదం కారణంగా అజ్ఞాతంలోకి లోకి వెల్లడా అనే ప్రశ్న ప్రజల్లో కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments