కడప జిల్లాలో దారుణం.. సొంత చెల్లెలి కొడుకే..?

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:04 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. సొంత చెల్లెలి కొడుకే.. పెద్దమ్మను, పెదనాన్నను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం కొత్త బసాపురంలో నాగయ్య - నాగమ్మ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.  తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తుండగా వీరయ్య అనే వ్యక్తి దంపతులపై దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు.  
 
హంతకుడు వీరయ్య నాగమ్మకు స్వయానా చెల్లెలు కొడుకు. వీరి స్వగ్రామం చాపాడు మండలం నాగులపల్లి. అయితే నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేక పెద్దమ్మ నాగమ్మ, పెదనాన్న నాగయ్యను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యకు పాల్పడిన వీరయ్య ఆ ప్రదేశంలోని ఓ ఇంట్లో దాగి ఉండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments