Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం ఎంపిక వ్యవహారంలో గందరగోళం

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (18:16 IST)
కడప బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం ఎంపిక వ్యవహారం చిలికి చిలికి గాలివాన మారుతోంది. మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో 20 మంది పీఠాధిపతులు 2021, జూన్ 12వ తేదీ శనివారం సాయంత్రం బ్రహ్మంగారి మఠానికి వస్తున్నారు. శైవక్షేత్రం నుంచి శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, మరో 9 మంది స్వామలు బయలుదేరగా…తెలుగురాష్ట్రాల నుంచి సాయంత్రానికి మరో 11 మంది పీఠాధిపతులు, స్వాములు చేరుకోనున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
ముందస్తు జాగ్రత్తలో భాగంగా అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. పీఠాధిపతులను కలవాలంటే ప్రత్యేక పాస్ లు తీసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ మంది జనాలు గుమికూడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రహ్మంగారి మఠం దేవాలయానికి వెళ్లే దారులను బ్యారికేడ్‌లతో మూసివేశారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
 
శైవక్షేత్ర పీఠాధిపతి శివయ్య స్వామితో పాటు మరి కొందరు దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి మెదటి భార్య కుమారునికి పీఠాధిపత్యం అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివయ్య స్వామి వాదనను విశ్వబ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మారుతీ మహాలక్ష్మి కుమారుడు గోవింద స్వామికే పీఠాధిపత్యం అప్పగించాలని విశ్వబ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments