Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడప నడిబొడ్డున న్యాయవాది అనుమానాస్పద మృతి... హత్యేనా...?

కడప నడిబొడ్డున న్యాయవాది అనుమానాస్పద మృతి... హత్యేనా...?
, మంగళవారం, 2 మార్చి 2021 (12:06 IST)
తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదులు వరుసగా హత్యకు గురవుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వామనరావు అనే న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇపుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నడిబొడ్డున ఓ న్యాయవాది అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు కలకలం రేపుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే రాజారెడ్డి వీధికి చెందిన‌ న్యాయవాది పి.సుబ్రమణ్యం గ‌త‌ రాత్రి తన ఇంటి నుంచి పాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు ఫోన్ చేయ‌గా ఆయ‌న సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి ఉంద‌ని వారికి తెలిసింది.
 
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు అ సుబ్రమణ్యం పాత అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లి ఆయ‌న కోసం వెతికారు. అక్కడే సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పులు ఉన్నాయి కానీ, మ‌నిషి లేక‌పోవ‌డంతో అపార్ట్‌మెంట్ ప‌రిస‌రాల్లో గాలించారు.
 
అపార్ట్‌మెంట్‌ కింద సుబ్రమణ్యం మృత‌దేహం రక్తపు మడుగులో పడి ఉండ‌డాన్ని చూసిన పోలీసులు ఆయ‌న‌ మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఆయ‌న‌ను ఎవ‌రైనా హత్యా చేశారా? లేక ఆయ‌న‌ ఆత్మహత్యకు పాల్పడ్డా‌? అన్న విష‌యంపై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి అద్దె అడిగాడనీ యజమానిని కొట్టి చంపేశారు... ఎక్కడ?