Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ పి.ఆర్.ఓ., నిర్మాత మహేష్ కోనేరు మృతి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (12:03 IST)
జూనియ‌ర్ ఎన్టీయార్ కు చేదోడు వాదాడుగా ఉంటూ, ఆయ‌న సినిమాల కోసం పి.ఆర్.ఓ. గా, ఆయ‌న‌కు మేనేజ‌ర్ గా  ప‌నిచేసిన ప్ర‌ముఖ నిర్మాత మ‌హేష్ కోనేరు మృతి చెందారు. ఈ ఉద‌యం విశాఖపట్నంలో ఆయ‌న‌ గుండెపోటుతో మృతి చెందారు. యువ‌కుడే అయిన మ‌హేష్ మృతిని ఎవ‌రూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయ‌న‌కు గుండె పోటు రావడం ఏంట‌ని విషాదం వ్య‌క్తం చేస్తున్నారు.
 
జూనియ‌ర్ ఎన్టీయార్ కు మేనేజర్ గా ప‌నిచేస్తూ, మ‌హేష్ ప్రొడ‌క్ష‌న్ ఫీల్డ్ లో కూడా ప్ర‌వేశించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరిట సంస్థ‌ను స్థాపించి, కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. అంతేకాదు చాలా సినిమాల‌ను డిస్ట్రిబ్యూష‌న్ కూడా చేశారు. ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు గుండెపోటుతో మృతి చెందిన వార్త ఈ ఉద‌యం దావాన‌లంలా సినీ వ‌ర్గాల‌లో వ్యాపించింది.

ఆయన చాలా ఏళ్ల నుంచి ఎన్టీయార్ కు మేనేజర్ గా పనిచేస్తున్నారు. పలు సినిమాలకు మహేష్ డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి, 118, మిస్ ఇండియా, తిమ్మరుసు వంటి చిత్రాలు నిర్మించారు. ఇవాళ ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో చికిత్స పొందుతూ మ‌హేష్ మృతి చెందడం ఇండస్ట్రీలో అందరికీ షాక్ గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments