Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా' ఎన్నికల్లో ఓటు వేయని ప్రముఖులు.. సమంత, రకుల్ అందుకే రాలేదు

Advertiesment
Maa Elections 2021
, ఆదివారం, 10 అక్టోబరు 2021 (17:48 IST)
మా ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కును వినియోగం చేసుకోలేదు. మా.. ఎన్నికలు ఈసారి చాలా టఫ్‌గా జరిగాయి. రెండు ప్యానళ్లు పోటాపోటీగా ప్రచారం చేశాయి. అందుకే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనా గురిపెట్టాయి. చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి కూడా సభ్యులను రమ్మని, ఓటేయమని ఆహ్వానించాయి. దీంతో భారీ స్థాయిలో తారలంతా తరలివచ్చారు. మా చరిత్రలోనే ఎక్కువగా పోలింగ్ నమోదై రికార్డ్ సృష్టించింది. కానీ ఇంత హడావుడిలోనూ చాలామంది స్టార్లు ఓటేయడానికి రాలేదు.
 
ఓటయడానికి రాని హీరోల లిస్టు చూస్తే.. వెంకటేశ్, రానా, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రవితేజ, నాగచైతన్య, నితిన్, సుమంత్, నాగశౌర్య, సునీల్ ఉన్నారు. దీంతో వీళ్లను చూడడానికి దూరాభారాలు లెక్కేయకుండా పోలింగ్ బూత్ దగ్గర పడిగాపులు పడ్డ అభిమానులకు నిరాశ తప్పలేదు.
 
ఓటేయడానికి రాని హీరోయిన్లు ఎవరంటే.. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, అనుష్క ఉన్నారు. వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు కావడంతో ఆమె వస్తుందని చెప్పలేం. సమంత విడాకుల వ్యవహారం వల్ల రాలేకపోయిందని టాక్. మరి తమన్నా, అనుష్క సంగతేంటి? కొంతమంది బిజీ షెడ్యూల్ వల్ల, మరికొందరు షూటింగుల్లో ఉండడం వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''మా'' కౌంటింగ్ ప్రారంభం... మంచు విష్ణు ప్యానలే గెలుస్తుంది.. ఎవరు?