Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలు కావాలన్న సమంత.. అబార్షన్ చేయించిన?? : నిర్మాత నీలిమ గుణ

పిల్లలు కావాలన్న సమంత.. అబార్షన్ చేయించిన?? : నిర్మాత నీలిమ గుణ
, శనివారం, 9 అక్టోబరు 2021 (13:35 IST)
టాలీవుడ్ క్యూట్ కపుల్స్ అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారు. తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని వారిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై వారు ప్రకటన చేయడంతో ప్రతి ఒక్కరూ విస్తుపోయారు. 
 
అయితే, ఈ విషయంలో సమంత తొందరపడ్డారని అనేక మంది ట్రోల్స్ చేస్తున్నారు. సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని.. అబార్షన్ చేయించుకుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఇక తాజాగా వీటిపై సమంత స్పందించింది. వాటిని తీవ్రంగా ఖండిస్తూ భావోద్వేగ ట్వీట్ ఒకటి పోస్ట్ చేసింది.
 
'నాకు అఫైర్స్ ఉన్నాయని.. పిల్లలు వద్దనుకున్నానని, అవకాశవాదినని.. అబార్షన్లు చేయించుకున్నానని' తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సమంత మండిపడింది. ఇలా తనపై పర్సనల్‌గా ఎటాక్ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. విడాకులు తీసుకోవడం ఎంతో బాధతో కూడుకున్నదని.. ఈ కఠిన సమయంలో తనకు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు' అంటూ సమంత ట్వీట్ చేసింది. 
 
అయితే, చై-సామ్ విడాకులపై నిర్మాత నీలిమ గుణ షాకింగ్ కామెంట్స్ చేసింది. సామ్ తల్లి కావాలనుకుందని.. కానీ ఇంతలోనే ఏదో జరిగిందని ఆమె వెల్లడించింది. 'శాకుంతలం సినిమా కోసం సమంతను సంప్రదించినప్పుడు.. ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయింది. ఫ్యామిలీని ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పట్లో సినిమా చేయనని వివరించింది. 
 
కానీ మా సినిమా కథ నచ్చడంతో కొన్ని కండీషన్స్ పెట్టింది. తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని కోరింది. ఈ మూవీ అనంతరం సమంత సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవాలని.. తల్లి కావాలని అనుకుంది. సామ్ చెప్పిన ప్రకారం మేము షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. సినిమాల నుంచి ఎక్కువ కాలం విరామం తీసుకుని.. పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసుకుంది. అదే ఆమె ప్రాధాన్యతగా చెప్పుకొచ్చిందని' నీలిమ స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భవదీయుడు భగత్ సింగ్... పవన్ సరసన పూజా హెగ్డే