Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుపై కోర్టులు కూడా కక్షగట్టాయి : విజయసాయి రెడ్డి

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:15 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా, ఆయన గురువారం జరిగిన సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో కరోనా వైరస్ మహమ్మారిపై జరిగిన చర్చలో పాల్గొన్న విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద దుమారాన్నే రేపాయి. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మేలుకోసం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు స్టేలు విధిస్తున్నాయని, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై కోర్టులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
 
అయితే విజయసాయి రెడ్డి ప్రసంగాన్ని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. సబ్జెక్టు దాటి మాట్లాడుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా విజయసాయి ఏమాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలో మాట్లాడుతూ పోయారు. 
 
ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు కనకమేడల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి పార్లమెంటులో మాట్లాడటం దారుణమన్నారు. కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారన్నారు. కరోనా గురించి మాట్లాడకుండా, ఇతర అంశాల గురించి మాట్లాడటం ఏమిటని ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments