Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పదవి వరిస్తే నేనూ - కేసీఆర్ సమానమే కదా : జితేందర్ రెడ్డి

Webdunia
ఆదివారం, 12 జనవరి 2020 (16:32 IST)
తాను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటి స్థాయికి ఎదుగుతానని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాలం కలిసివచ్చి, అవకాశం వస్తే తాను కూడా బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపడుతానని జోస్యం చెప్పారు. 
 
మహబూబ్​నగర్​లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ మాటలు మాట్లాడారు. అవకాశముంటే భాజపాకు తాను రాష్ట్ర అధ్యక్షుడిని అవుతానేమో.. కేసీఆర్​తో సమానమైన పదవిలో ఉంటానేమో అని చెప్పుకొచ్చారు. 
 
తనకు ఎంపీగా పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాకు అవకాశమివ్వలేదనీ, అయినప్పటికీ తాను అధైర్యపడలేదని చెప్పారు. దేవుడి దయ ఉంటే ప్రస్తుతం తానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కావొచ్చు.. అది పెద్ద పోస్టే కదా అంటూ తనకు తాను ఓదార్చుకున్నారు. 
 
భాజపా నుంచి కౌన్సిలర్‌గా పోటీచేసే అవకాశం రాని కార్యకర్తలు నిరాశపడొద్దని.. అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తనకు టికెట్‌ ఇవ్వని కేసీఆర్‌ ఇపుడు తెరాసకు రాష్ట్ర అధ్యక్షుడు అని.. అవకాశం భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా తానుంటానని.. అప్పుడు ఇద్దరి పదవులు సమానమే కదా అని జితేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments