ఏపీ రాజకీయాల్లో సంచలనం : వైఎస్ఆర్ సతీమణితో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ!!

వరుణ్
సోమవారం, 29 జులై 2024 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని విజయమ్మ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా పలుకరించుకున్నారు. విజయమ్మను ఆప్యాయంగా పలుకరించిన జేసీ.. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
విజయమ్మ, జేసీ కుటుంబం మధ్య బంధుత్వం కూడా ఉంది. దీంతో ఆమెను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసినట్టు సమాచారం. వీరిద్దరూ చాలాసేవు భేటీ అయ్యారు. అయితే, ఏం చర్చించుకున్నారన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. విజయమ్మ ఆరోగ్యం బాగాలేదన్న సమాచారంతోనే ఆమెను పలుకరించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాకర్ రెడ్డి కూడా వీరి భేటీపై పెదవి విప్పకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments