Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెప్పులు కుట్టే వ్యక్తిని కలిసిన రాహుల్.. మరుసటి రోజే మెషీన్

Rahul Gandhi

వరుణ్

, ఆదివారం, 28 జులై 2024 (08:21 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పులు కుట్టే వ్యక్తి వద్ద కాసేపు మాట్లాడారు. అతని సమస్యలను అడిగి తెలుసుకుని అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాపై వ్యాఖ్యల కేసులో సుల్తాన్‌పుర్‌లోని కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన దారిలో రామ్‌ చేత్‌ అనే చెప్పులు కుట్టే వ్యక్తివద్ద ఆగారు. ఆయనతో మాట్లాడారు. అంతేగాకుండా రాహుల్ గాంధీ బృందం శనివారం రామ్‌ చేత్‌కు కుట్టు యంత్రం అందించింది. దీంతో రామ్ చేత్‌ సంతోషానికి అవధుల్లేవ్. రాహుల్ సాయంపై ఆనందంతో ఉన్న చైత్.. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ రెండు జతల షూలను పంపాడు. 
webdunia
Rahul Gandhi
 
చెప్పులు కుట్టే పనిని ఈ మిషన్ పని సులువు చేస్తుందని తమ నేతను చూసి గర్విస్తున్నామని ఉత్తర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ చెప్పారు. "రాహుల్ గాంధీ ప్రజల మనిషి అని ఈ సంఘటన తెలియజేస్తుంది. ప్రజా సేవలో ఆయన అంకిత భావం ప్రస్ఫుటమవుతోంది" అని కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాస్టల్‌లో గొడవ.. కత్తి దాడి.. రూమ్‌మేట్‌ను హత్య చేశాడు..