Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు శవయాత్ర చేసేందుకు వీళ్లెవరు..? రోడ్డుపై వెళ్లే కుక్కలు మొరిగితే?

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తండ్రి వై.ఎస్. రాజారెడ్డిపై టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్‌కు సంబంధించి తాను అబద్ధాలు మాట్లాడలేదని తెలిపారు. జగన్ గురించి

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (10:12 IST)
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తండ్రి వై.ఎస్. రాజారెడ్డిపై టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్‌కు సంబంధించి తాను అబద్ధాలు మాట్లాడలేదని తెలిపారు. జగన్ గురించి దుర్మార్గంగా తానెక్కడా వ్యాఖ్యానించలేదని చెప్పారు. తనపై విమర్శలు చేసే అర్హత ఏ ఒక్కరికీ లేదని అన్నారు. 
 
జానీవాకర్ మందు తాగి మాట్లాడానని తనను కొందరు విమర్శిస్తున్నారని.. తన కుటుంబంలో మందు తాగే అలవాటు ఎవ్వరికీ లేదని జేసీ తెలిపారు. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి మంగంపేటకు వెళ్లి.. ఒకరిని చంపి.. వాళ్ల ఆస్తిని లాక్కోలేదా? అని జేసీ ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడితే తనకు శవయాత్రలు నిర్వహిస్తారా? అంటూ జేసీ మండిపడ్డారు. 
 
తనకు శవయాత్ర చేయడానికి వీళ్లంతా ఎవరు? తనకు పుట్టినవారు అయితేనే తనకు శవయాత్ర చేస్తారంటూ ఘాటుగా స్పందించారు. పూటకో పార్టీ మారేవారు కూడా తనను విమర్శిస్తారా.. అంటూ మండిపడ్డారు. రోడ్డుపై వెళ్లే కుక్కలు మొరిగితే.. వాటికి స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను మాట్లాడిన ప్రతి మాటనూ, సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని... ఎవరైనా తను ముందుకు రావచ్చని సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments