Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యావరణహితంగా దీపావళి జరుపుకుందాం... పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ఇంటిల్లపాది సంతోషాలతో జరుపుకోవడంతో పాటు.. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగను ప్రతి ఒక్కరూ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (14:08 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ఇంటిల్లపాది సంతోషాలతో జరుపుకోవడంతో పాటు.. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. దేశంవ్యాప్తంగా జరిగే దీపావళి పండుగను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ బుధవారం ఓ ప్రకటన చేశారు. 
 
ఆ ప్రకటనలో "దీప్తం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతి అద్దం పడుతుంది. అటువంటి ఈ దీపాల పండుగ సందర్భంగా యావత్‌ తెలుగుజాతితో పాటు దేశ ప్రజలందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళిని పర్యవరణ హితంగా జరుపుకోవడం మన అందరి బాధ్యత. పర్యావరణానికి హాని కలిగించని టపాసులతో ఈ దీపావళి వేడుక జరుపుకుంటే ప్రకృతితో పాటు మనందరికీ క్షేమకరం. ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అశ్రద్ధ చేయరాదని మనవి. ఈ దీపావళి అందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాంటూ" తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments