Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గబ్బర్ సింగ్‌లో ఏం చేస్తిరిపై రాజశేఖర్ ఏమన్నారు? శివానీ ఎంట్రీ ఖాయమన్నారు..

''గబ్బర్ సింగ్'' సినిమా గురించి హీరో రాజశేఖర్ స్పందించారు. పవన్ కల్యాణ్‌కు తనంటే చాలా కోపమని హీరో రాజశేఖర్ తెలిపాడు. డ్యాన్స్ చేపించిన తర్వాత ఏం చేస్తిరి.. ఏం చేస్తిరి.. ఏంటి? అని అలీ ఏదో వచ్చి మాట్లా

గబ్బర్ సింగ్‌లో ఏం చేస్తిరిపై రాజశేఖర్ ఏమన్నారు? శివానీ ఎంట్రీ ఖాయమన్నారు..
, సోమవారం, 16 అక్టోబరు 2017 (14:40 IST)
''గబ్బర్ సింగ్'' సినిమా గురించి హీరో రాజశేఖర్ స్పందించారు. పవన్ కల్యాణ్‌కు తనంటే చాలా కోపమని హీరో రాజశేఖర్ తెలిపాడు. డ్యాన్స్ చేపించిన తర్వాత ఏం చేస్తిరి.. ఏం చేస్తిరి.. ఏంటి? అని అలీ ఏదో వచ్చి మాట్లాడినట్టు చూపిస్తారు. ఆయన కోపాన్ని.. ఏంట్రా.. చూస్కో అన్నట్లు తనకు వార్నింగ్ ఇచ్చారని.. ఆ సీన్ తన కోసమే పవన్ చేశారని రాజశేఖర్ చెప్పారు.
 
గబ్బర్ సింగ్ చిత్రంలోని ఈ సీన్ ద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తనను ఇమిటేట్ చేయడం తనకు బాధ కలిగించిందని రాజశేఖర్ అన్నారు. గతంలో పీఆర్పీలో జరిగిన విషయాలు.. పవన్ గురించి జరిగిన విషయాలు తాను చెప్పాను. అందుకే పవన్‌కు తనపై కోపం అనుకుంటానని రాజశేఖర్ చెప్పారు. త్వరలో తాను నటిస్తున్న గరుడవేగ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు. 
 
అంతేగాకుండా.. తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పదలుచుకుంటున్నానని... త్వరలో తన వారసురాలు హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనుందని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. తన పెద్ద కుమార్తె శివానీకి సినిమాల్లో నటించడం అంటే ఇష్టమని.. తొలి సినిమా కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నానన్నారు. మంచి సబ్జెక్ట్ వున్న సినిమాల్లో నటించేందుకు శివానీ ఆసక్తి చూపుతుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్య స్టంట్ మాస్టర్లను స్టేజ్‌పైనే కుమ్మేశారు.. ఆపై తొడగొట్టారు.. (వీడియో)