Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ సమరం : బాపట్లలో ముగ్గురు జనసేన అభ్యర్థులు..

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. ప్రధానంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. ఈనెల 28వ తేదీన పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. 
 
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ తరపున ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నరు. ఈ నియోజకవర్గంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయమై కార్యకర్తలు తికమక పడుతున్నారు.
 
ఈ స్థానంలో తొలుత పార్టీ నుంచి బీ-ఫారం అందుకున్న రైల్వే కాంట్రాక్టర్ పులుగు మధుసూదన్‌ రెడ్డి తొలుత నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ మాజీ జేడీ వివి. లక్ష్మీనారాయణ సన్నిహితుడు ఇక్కుర్తి లక్ష్మీనరసింహకు టికెట్ ఇచ్చి మధుసూదన్‌రెడ్డి బీ-ఫారంను జనసేన రద్దు చేసింది. దీంతో సోమవారం లక్ష్మీనరసింహ నామినేషన్ వేశారు.
 
అయితే, పార్టీ నుంచి బీ-ఫారం లేకపోయినప్పటికీ తానే అభ్యర్థినంటూ ఆ పార్టీకి చెందిన మరో నేత బీకే నాయుడు కూడా ఇక్కడి నుంచి నామినేషన్ వేశారు. ఇలా ఒకే పార్టీకి చెందిన ముగ్గురు నేతలు బరిలో ఉండటంతో జనసేన శ్రేణులు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments