Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా గారూ.. మా విశాఖను కబ్జాకోరుల నుంచి రక్షించండి...

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (15:18 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జన జాగరణ సమితి నిర్వాహకులు ఓ విజ్ఞప్తి చేశారు. కబ్జాకోరుల నుంచి మా విశాఖపట్టణాన్ని రక్షించాలంటూ వైజాగ్ వ్యాప్తంగా గోడలకు పోస్టర్లు అంటించారు. నగరంలో భూకబ్జాలు, గనులు, ఇసుక దోపిడీ, గంజాయి మాఫియా, క్రికెట్ బెట్టింగులు, దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయంటూ అర్థమొచ్చేలా ఈ పోస్టర్లను ముద్రించి నగర వ్యాప్తంగా అంటించారు. ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, గంజా మాఫియా, క్రికెట్ బెట్టింగ్స్, మర్డర్లు, కిడ్నాప్‌లు ఇలా అన్నీ పెరిగిపోతున్నాయని, అందువల్ల వైజాగ్‌ను రక్షించాలంటూ జన జాగరణ సమితి విన్నవించింది.
 
ఇదేవిషయంపై ఆ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ, ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో భూములకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. భూకబ్జాలు, గంజాయి గురించిన వార్తలు తరచూ వింటుంటే చాలా బాధగా ఉందన్నారు. సాక్షాత్తూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఏకంగా కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు నిర్బంధించడంతో ఆయన విచారం వ్యక్తం చేశారు. అరాచక శక్తులకు అడ్డాగా విశాఖ మారిందంటూ వ్యాఖ్యానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా... ఇపుడు విశాఖను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments