Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ - సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు : తీర్పు సెప్టెంబరు 15కు వాయిదా

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (14:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పిటిషన్లపై బుధవారం తీర్పును వెలువరిస్తామని గత విచారణ సందర్భంగా ప్రకటించింది. కానీ, మరోమారు ఈ తీర్పును వాయిదావేసింది. తుది తీర్పును వచ్చే నెల 15న వెలువరిస్తామని తెలిపింది. 
 
జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరి పిటిషన్లపై తీర్పును ఒకే రోజున వెలువరిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై గత నెలాఖరులో వాదనలు ముగిశాయి. సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
 
సీఎం స్థాయిలో ఉన్న జగన్ తనకున్న అధికారాన్ని ఉపయోగించి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని తన పిటిషన్ లో రఘురాజు పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేసి, విచారణను త్వరగా ముగించాలని కోర్టును ఆయన కోరారు. వివిధ కారణాలను చెపుతూ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments