Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు తేలనున్న ఏపీ సీఎం జగన్ భవితవ్యం!!

నేడు తేలనున్న ఏపీ సీఎం జగన్ భవితవ్యం!!
, బుధవారం, 25 ఆగస్టు 2021 (07:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి భవితవ్యం నేడు తేలనుంది. ఆయన బెయిలు రద్దుకు సంబంధించి సీబీఐ కోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించనుంది. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనన్న అంశం రాజకీయ వర్గాలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. 
 
సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేసి వారిపై నమోదైన కేసులను త్వరితగతిన విచారించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏప్రిల్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాలను జగన్ దుర్వినియోగం చేస్తూ బెయిలు షరతులను ఉల్లంఘిస్తున్నారని అందులో ఆరోపించారు. 
 
ముఖ్యంగా, వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని రఘురామ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జులైలోనే వాదనలు పూర్తి కాగా తీర్పును సీబీఐ కోర్టు బుధవారానికి రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనన్న అటు వైసీపీ నేతల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ... జొజో... ఛీఛూ... నా బుజ్జి పాప: కాబూల్ విమానాశ్రయంలో అమెరికన్ ముద్దుమురిపాలు