Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేగంగా లారీని ఢీకొట్టిన కారు: మహిళా ఇంజినీర్ అక్కడికక్కడే మృతి

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (14:19 IST)
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూకట్ పల్లికి చెందిన మహిళా ఇంజినీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే.. గోవా నుంచి తన స్నేహితులతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిహారిక కారులో బయలుదేరింది. కారును ఆమే స్వయంగా నడుపుతోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తా 65 నంబర్ జాతీయ రహదారి పక్కనే ఆగి వున్న లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీనితో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.
 
నిహారిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహం కారు శకలాల్లో ఇరుక్కుపోయింది. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments