Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రైతులకు శుభవార్త.. అకౌంట్‌లోకి రూ.24వేలు

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (11:29 IST)
ఏపీ రైతులకు శుభవార్త. ఏపీకి చెందిన రైతన్నల అకౌంట్లలోకి శుక్రవారం రూ.24వేలు రానున్నాయి. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నేతన్న నేస్తం’ పథకం కింద లబ్ధిదారులకు ఇవాళ సీఎం జగన్ నిధులు అందించనున్నారు. 80,686 మంది ఖాతాల్లో రూ. 24 వేల చొప్పున మేర జమ చేస్తారు.
 
ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో వర్చువల్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ ఈ నగదును జమచేయనున్నారు. కాగా, ఈ పథకం ద్వారా గత నాలుగేళ్లలో నేతన్నలకు రూ.776 కోట్ల సాయం అందింది.

జూలై 21వ తేదీ ఉదయం సీఎం వైఎస్ జగన్ తన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వెంకటగిరిలోని విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తదనంతరం, ముఖ్యమంత్రి ఒక్క బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ. 24,000 ఆర్థిక సహాయం మొత్తాన్ని నేరుగా బదిలీ చేస్తారు.
 
‘వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం’ సంక్షేమ పథకం చేనేత కుటుంబాలకు స్థిరమైన సహాయాన్ని అందిస్తూ వారిని మరింత స్వావలంబనగా తీర్చిదిద్దుతోంది. ఈరోజు అందజేస్తున్న సాయంతో కలిపి, ‘వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం’ కింద అర్హులైన ప్రతి నేత కుటుంబానికి జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1,20,000 అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments