Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంసారం చేయాలన్నా J- ట్యాక్స్ కట్టాలా? చంద్రబాబు ప్రశ్న

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆయన ఆరోపించారు. అదేసమయంలో జగన్ పాలనపై చంద్రబాబు సంధించిన సెటైర్లు నవ్వులు తెప్పించాయి. 
 
ఆయన బుధవారం ఆయన గంటూరులో విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ హయాంలో చేసిన పనులు ఆదర్శవంతంగా ఉన్నాయని, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశామని, మురుగు కాల్వలు కట్టించామని, శ్మశానాలు ఏర్పాటు చేశామని, ఏడు లక్షల పంటగుంటలు తవ్వామని గుర్తుచేశారు. 
 
ఆ పంట గుంటలకు ఈ ఏడాదిలో పదిసార్లు నీళ్లొచ్చాయని, తద్వారా భూగర్భజలాలు పెరిగి కరవు తీరిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏదో చేసిందని వాళ్ల నాయకులు చెప్పుకుంటున్నారని, ఇంత వరకూ ఒక తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు. ఇరిగేషన్‌కు సంబంధించి ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని మండిపడ్డారు. 
 
ఎవరి పొలంలో వాళ్లు మట్టి తీసుకోవాలంటే అధికారుల అనుమతి కావాలా? అందుకు మైనింగ్ శాఖకు డబ్బుల కట్టాలా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. పైగా, 'J- ట్యాక్స్.. జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ కట్టాలా! రేపు భార్యాభర్తలు కాపురం చేయాలన్నా J-ట్యాక్స్ కట్టే పరిస్థితి వస్తుంది' అంటూ జగన్ పాలనపై సెటైర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments