జగన్‌పై దాడి కేసు విచారణ ముమ్మరం

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (16:23 IST)
ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై వైజాగ్ విమానాశ్రయంలో జరిగిన దాడిపై దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. నిందితుడు శ్రీనివాస్‌ రావు చెప్పినట్లుగా లేఖ రాసిన వ్యక్తితో పాటు మరొక వ్యక్తిని పోలీసులు విచారించారు.
 
నిందితుడి స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేల్లంకలోని అతడి బంధువులు, స్నేహితులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు. దాడికి రెండ్రోజుల ముందే శ్రీనివాస్‌ కొత్త సిమ్‌ కొనుగోలు చేయడంతో దానికి సంబంధించిన ఫోన్‌కాల్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు. 
 
నిందితుడు పనిచేసే రెస్టారెంట్‌ యజమానికి సైతం నోటీసులు జారీచేసి విచారణ చేశారు. ఈ దాడికి సంబంధించి శ్రీనివాస్‌ను ఎవరైనా ప్రలోభపెట్టారా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు గతంలో కొద్దిరోజులు దుబాయిలో పనిచేశాడని, ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేశాడని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments