Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ కొత్త త‌ర‌హా నేత‌, బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టాడు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (17:06 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త తరహా నాయకుడ‌ని, సంప్రదాయ బద్ధమైన నాయకుడు కాద‌ని ప్రభుత్వ సలహాదారులు సజ్జ‌ల రామకృష్ణ రెడ్డి విశ్లేషించారు. సంప్రదాయ బద్దమైన రాజకీయాలు చేస్తూ, త‌న‌ లబ్ది కోసం కాకుండా, భావితరాల భవిష్యత్తు కోసం చూసే నాయకుడ‌ని కొనియాడారు.

కొంతమంది చేయలేని పనులను మన నాయకుడు చేస్తుంటే, రాజకీయ శూన్యంతో కొంద‌రు ఆరోపణలు చేస్తూ, పిచ్చిరాతలు రాస్తున్నార‌ని ఎల్లో మీడియాను స‌జ్జ‌ల దుయ్య‌బ‌ట్టారు. ఇలాంటి దుష్పచారాలను మనమందరం కలిసి తిప్పికొట్టాల‌న్నారు. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా బిసిల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిఅని, గత నాయకులు బలహీనవర్గాలను ఓటు బ్యాంకుగా చూస్తే, వారి ఎదుగుదల కోసం జ‌గ‌న్ కృషి చేస్తున్నార‌న్నారు.

ముఖ్యమంత్రి బిసిలోని 139 కులాలకు గొప్ప అవకాశం కల్పించార‌ని, దానిని ఉపయోగించుకొని సామజికంగా,రాజకీయంగా ఎదగాల‌ని పిలుపునిచ్చారు. మిమ్మల్ని ఓటు బ్యాంకుగా చూసే వారికి మీ ఎదుగుదలే సమాధానంగా మారాలి అని జ‌గ‌న్ ఆకాంక్షగా చెప్పారు. బిసి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నా అని స‌జ్జ‌ల పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments