Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేట్ అచ్చెన్న.. పెద్దాయన అడిగితే చేయకుంటే ఎలా..? బాబు ముఖం చూడాలి..?

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (16:00 IST)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీఏసీ సమావేశంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు, కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రస్తావన వచ్చినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సభకు చంద్రబాబును తీసుకురావాలని అన్నారు. కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబు మొహం చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణమేనని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా.. బీఏసీ సభకు కచ్చితంగా చంద్రబాబు వస్తారని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జగన్ మాట్లాడుతూ.. కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
 
ఇక, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి.. ఒక్క రోజే సభ జరుపుదామని భావిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. చాలా సమస్యలపై చర్చ జరగాల్సి ఉందని.. 15 రోజులు సమావేశాలు జరపాలని కోరారు. 
 
దీనిపై స్పందించిన జగన్.. ‘గ్రేట్ అచ్చెన్నాయుడు.. పెద్దాయన అడిగితే అంగీకరించకుంటే ఎలా..?’ అని వ్యాఖ్యానించారు. నవంబర్ 26 వరకు సభ జరుపుదామని జగన్ అన్నారు. సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూడాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments