Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశా.. టీడీపీలో నేను వలసపక్షిని...

సంచలన కామెంట్స్ చేయడంలోనూ, వివాదాల్లో చిక్కుకోవడంలోనూ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా ఉన్నాయి. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజక

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (09:55 IST)
సంచలన కామెంట్స్ చేయడంలోనూ, వివాదాల్లో చిక్కుకోవడంలోనూ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా ఉన్నాయి. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశాననీ, ఇపుడు టీడీపీలో తాను వలస పక్షిని అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అనంతపురం జిల్లా గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ యార్డు ఛైర్మెన్‌తో పాటు ఇక్కడున్నవారంతా ఒకే పార్టీలో సుదీర్ఘంగా ఉన్నారని, తాను మాత్రమే వలస పక్షిని అని వ్యాఖ్యానించారు. 
 
పైగా టీడీపీలో చేరినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు కిరీటమేమీ పెట్టలేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశాననే బాధ ఉందన్నారు. ఇకపోతే.. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, కానీ, ఆలోగా అది పూర్తి కాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments