Webdunia - Bharat's app for daily news and videos

Install App

వల్లభనేని వంశీ - దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత దేవినేని అవినాశ్ ఇళ్ళలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన టీడీపీ టిక్కెట్‌పై గెలిచి వైకాపా పంచన చేశారు. అలాగే, దేవినేని అవినాశ్ కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత టీడీపీ, ఇపుడు వైకాపాలో ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి ఐటీ అధికారులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ ఇద్దరి నేతల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఐటీ అధికారులు సోదాలకు రావడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ సోదాల వెనుక కారణం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. హైదరాబాద్ నగరంలోని వంశీరామ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో వీరు పెట్టుబడులు పెట్టారా? అనే కోణంలో ఈ సోదాలు జరుగుతుండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ తనీఖీలు పూర్తయితేగానీ అసలు గుట్టు తెలిసే అవకాశంలేకపోలేదు. ప్రస్తుతం ఈ సోదాలు అధికార వైకాపాలో కలకలం రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments