Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యాలయాలు తెరిచేది అనుమానమే

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (05:50 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా విద్యాలయాలను కూడా మూసేశారు.

అయితే వచ్చే 14వ తేదీ నుంచి లాక్ డౌన్ ఎత్తేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విద్యాలయాలు తెరిచేది అనుమానంగానే వుంది. స్కూళ్లు తెరిస్తే విద్యార్థులు గుంపులు గుంపులుగా చేరటం ఖాయం.

ఫలితంగా సామాజిక దూరానికి విఘాతం కలుగుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

ఇప్పటికే ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండా ఆల్‌ పాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా వేశారు. విద్యా క్యాలెండర్‌ ప్రకారం ఈ నెల 23 వరకు స్కూళ్లు పని చేస్తాయి. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.

ఈ నెల 14 తరువాత ఈ విద్యా సంవత్సరంలో ఆదివారాలు పోనూ ఇంకా 7 పనిదినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజా పరిస్ధితుల్లో ఈ కొద్ది రోజులు స్కూళ్లు తెరిపించినా ఒనకూరే ప్రయోజనం ఏమీ లేదని భావిస్తున్నారు.

ఒకేసారి వేసవి సెలవుల వరకు అంటే జూన్‌ 11వ తేదీ వరకు స్కూళ్లు మూత తప్పదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments