Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం సక్సెస్... ఐదేళ్లపాటు సేవలు

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (15:51 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-48 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. స్వదేశీ ఉపగ్రహం రీశాట్-2తో పాటు.. విదేశాలకు చెందిన మొత్తం 9 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు. రీశాట్-2 628 కేజీలుగా ఉంది. అలాగే, అమెరికాకు చెందిన ఆరు శాటిలైట్స్, ఇజ్రాయెల్‌, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ48 నింగిలోకి మోసుకెళ్లింది. 
 
సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి పీఎస్‌ఎల్వీ సీ-48 ద్వారా రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ ‘రీశాట్‌-2బీఆర్‌1’ ప్రయోగాన్ని నిర్వహించారు. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 50వది కావడం మరో విశేషం. 
 
మంగళవారం సాయంత్రం 4.40కు మొదలైన కౌంట్‌డౌన్‌ బుధవారం మధ్యాహ్నం 3:25 గంటల వరకు కొనసాగింది. 628 కిలోల బరువున్న రిశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. ఐదేళ్ళపాటు ఇది సేవలు అందించనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్‌-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments