Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం సక్సెస్... ఐదేళ్లపాటు సేవలు

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (15:51 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-48 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. స్వదేశీ ఉపగ్రహం రీశాట్-2తో పాటు.. విదేశాలకు చెందిన మొత్తం 9 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు. రీశాట్-2 628 కేజీలుగా ఉంది. అలాగే, అమెరికాకు చెందిన ఆరు శాటిలైట్స్, ఇజ్రాయెల్‌, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ48 నింగిలోకి మోసుకెళ్లింది. 
 
సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి పీఎస్‌ఎల్వీ సీ-48 ద్వారా రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ ‘రీశాట్‌-2బీఆర్‌1’ ప్రయోగాన్ని నిర్వహించారు. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 50వది కావడం మరో విశేషం. 
 
మంగళవారం సాయంత్రం 4.40కు మొదలైన కౌంట్‌డౌన్‌ బుధవారం మధ్యాహ్నం 3:25 గంటల వరకు కొనసాగింది. 628 కిలోల బరువున్న రిశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. ఐదేళ్ళపాటు ఇది సేవలు అందించనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్‌-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments