Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకిన్​ ఇండియాకు పునాదిరాయి వేసిన ఇస్రో

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (13:01 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్​ ఇండియా నినాదానికి ఇస్రో పునాదిరాయి వేసింది. 5 పీఎస్​ఎల్​వీ రాకెట్లను తయారు చేసేందుకు మన దేశ కంపెనీలకు ఆహ్వానం పలికింది. ఇస్రో ఛైర్మన్​ కె.శివన్​ ఆ వివరాలను వెల్లడించారు. 
 
'ఇంట్రెస్ట్​ ఉన్న కంపెనీలు బిడ్స్​ వేయాల్సిందిగా (ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్-ఈవోఐ) కోరాం. విదేశీ కంపెనీలకు ఇందులో చోటు లేదు. ప్రభుత్వం చేపట్టిన మేకిన్​ ఇండియా కార్యక్రమానికి ఇది మరింత బలమిస్తుందని భావిస్తున్నాం' అని అన్నారు. ఒక్కో రాకెట్​ తయారీకి రూ.200 కోట్ల దాకా ఖర్చవుతుందని, బిడ్లు వేసే కంపెనీల్లో ఒక్కదానికి వెయ్యి కోట్ల ఆర్డర్​ దక్కుతుందని విక్రమ్​ సారాభాయ్​ స్పేస్​ సెంటర్​ సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు. 
 
ఆర్డర్​ దక్కించుకునే కంపెనీకి టెక్నాలజీ ట్రాన్స్​ఫర్​ బాధ్యతలను ఇస్రో కొత్తగా పెట్టిన న్యూ స్పేస్​ ఇండియా లిమిటెడ్ చూసుకుంటుంది.
 
 హాల్​, ఎల్​అండ్​ టీ కన్సార్టియంగా వస్తే.. 'మన దేశంలో హాల్​, ఎల్​ అండ్​ టీ వంటి కంపెనీలు ఇప్పటికే పీఎస్​ఎల్​వీ రాకెట్​ తయారీలో భాగస్వాములయ్యాయి. జనవరిలో ఆ రెండు కంపెనీలూ ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాయి. అవి కన్సార్టియంగా మారి ఈ ప్రాజెక్ట్​ను చేపడతాయని ఆశిస్తున్నా. కన్సార్షియంగా మారిన కంపెనీలే ఈవోఐకి రావాల్సిందిగా ఎన్​ఎస్​ఎల్​ఐ రూల్​ కూడా పెట్టింది. సెప్టెంబరు ఆరో తేదీ నాటికి ఈవోఐలు వస్తాయనుకుంటున్నాం. గోద్రెజ్​, కొన్ని చిన్న కంపెనీలూ ఈవోఐలపై ఆసక్తి చూపిస్తున్నాయి' అని శివన్​ చెప్పారు. 
 
ఒక్కో పీఎస్​ఎల్​వీ లాంచ్​ అయినప్పుడు అందులో 150 చిన్నా పెద్ద కంపెనీలు భాగస్వాములవుతున్నాయన్నారు. పీఎస్​ఎల్​వీ, జీఎస్​ఎల్​వీ రాకెట్లకు సంబంధించి సీఈ-20 క్రయోజెనిక్​ ఇంజన్​‌లను హాల్​ తయారు చేస్తుంటుంది. ఇప్పటిదాకా హాల్​కు 24 సెట్ల పీఎస్​ఎల్​వీ, రెండు సెట్ల జీఎస్​ఎల్​వీ ఆర్డర్లు ఇచ్చామన్నారు. పీఎస్​ఎల్​వీ ఎస్​139 సాలిడ్​ ఇంజన్లను ఎల్​అండ్​ టీ తయారు చేస్తోంది. కాగా, ఇస్రో నిర్ణయం స్వాగతించదగినదని, ఇస్రో కోసం ఉపగ్రహాలు తయారు చేస్తున్న ఆల్ఫా డిజైన్​ అనే కంపెనీ సీఎండీ కల్నల్​ హెచ్​ఎస్​ శంకర్​ అన్నారు. ప్రైవేట్​ కంపెనీలకు మార్కెట్​ను ఓపెన్​ చేయడం మంచిదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments