Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టుల చుట్టూ తిరగటమే అభివృద్దా?: వైసీపీకి సీపీఐ సూటి ప్రశ్న

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (11:27 IST)
65 అంశాలను వివాదాస్పదం చేసి కోర్టుల చుట్టూ తిరగటమే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్దా? అని సీపీఐ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఏడాది పాలనలో ఏ రంగంలో అభివృద్ధి సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ఏ రంగంలో అభివృద్ధి సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.

ఈ ఏడాది కాలంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు నిలిచిపోవటం నిజం కాదా?, 65 అంశాలను వివాదాస్పదం చేసి కోర్టుల చుట్టూ తిరగటమే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్దా?, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆన్‌లైన్‌ రమ్మీ ఆటలపై నిషేధం విధించాలని కోరుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డికీ, తుంగభద్ర వరద కాలువ నిర్మాణానికై చర్యలు వేగవంతం చెయ్యాలని మంత్రి పీ అనిల్‌కుమార్‌కు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments