Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

ఖైదీలను విడుదల చేయండి : సీపీఐ విజ్ఞప్తి

Advertiesment
prisoners
, మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (17:04 IST)
కరోనా కల్లోలం నేపథ్యంలో జైళ్లలో ఉన్న ఖైదీలను పెరోల్‌పై, ముద్దాయిలను బెయిల్‌పై విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ....రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోందని, కరోనా పాజిటివ్ కేసులు 722కు చేరాయన్నారు.

టెస్టులు పెరిగే కొద్దీ పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో తమ కుటుంబసభ్యులకు ఏమవుతుందోనని ముద్దాయిలు, ఖైదీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

ప్రస్తుతం జైళ్లను ఖాళీ చేసి కరోనా విపత్తు సద్దుమణిగాక తిరిగి ముద్దాయిలను జైలుకు పంపవచ్చని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైసీపీ సొంత విషయం కాదు: చంద్రబాబు