Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్దాప్య పింఛన్లు హాంఫట్.. కొత్తగా మంజూరైన పింఛన్లో దళారుల చేతివాటం

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (20:04 IST)
కొత్తగా మంజూరైన పింఛన్‌దారులు ఒక్కొక్కరి దగ్గరి నుండి సుమారుగా రూ. 1250 వసూళ్ల వ్యవహారం బయటకి పొక్కడంతో నాయకులు కల్పించుకొని తిరిగి ఇప్పించారు. 
 
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తల్వాయిపాడు గ్రామం అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వం ఎంతో శ్రమకోర్చి పేద ప్రజలకొరకు తలకుమించిన భారమైనా కూడా ఎంతో బాధ్యతతో ఇంటింటికి పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
 
కానీ కొందరు దళారులు మేము మీకు పింఛన్లు రావడానికి సహాయం చేసామనే నెపంతో ఒక్కొక్కరి దగ్గర సుమారుగా రూ. 1250/- వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మాట ఆనోటా ఈనోట పొక్కి  విషయం బయటకు రావడంతో  విషయం పెద్దది అవుతుందని భావించిన పెద్దమనుషులు కల్పించుకొని పింఛన్‌దారులకు కొంతమందికి వారి సొమ్ము తిరిగి ఇప్పించారని సమాచారం. 
 
దీనిపై పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా ఇప్పటివరకు మా దృష్టికి రాలేదని అన్నారు. వివరాలు సేకరించి తగు చర్యలకై ఉన్నతాధికారులకు తెలియ జేస్తామని చెప్పారు. 
 
గ్రామస్థులు కొందరు దీనిపై వాలంటైర్‌ని ప్రశ్నించగా తనకు తెలియదని,, వారి దగ్గర బయటి వ్యక్తులు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments