Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులిచింత‌ల‌కు బ‌య‌లుదేరిన టీడీపీ నేత‌ల అడ్డ‌గింత‌

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (12:24 IST)
పులిచింతల ప్రాజెక్టు ప్రాజెక్టు 16 వగేటు విరిగిపోవ‌డంతో, ఆ స్ధానంలో అమర్చిన స్టాప్ లాక్ గేటు  సందర్శిస్తామంటూ బయలుదేరిన గుంటూరు జిల్లా టిడిపి నాయకులను చేదు అనుభ‌వం ఎదుర‌యింది. పులిచింత‌ల ప‌ర్య‌ట‌న‌కు అనుమతి లేదంటూ పోలీసులు నిలపివేయటంతో టీడీపీ నేత‌లు గుంటూరు శివారులో ఆందోళనకు దిగారు. 
 
టిడిపి నిజనిర్ధారణ కమిటీలో పార్టీ నాయకులు జివీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాస్ తదితరులు ఉండగా, ప్రాజెక్టు వద్ద పోలీసు ఆంక్షలు కోనసాగటంతో, వారిని ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పులిచింతల ప్రాజెక్టు 16 గేటు సందర్శించడానికి వచ్చిన టిడిపి మాజీ ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు జీవి ఆంజనేయులు కొమ్మలపాటి శ్రీధర్‌లతో పాటు ఇతర టిడిపి మాదిపాడు వద్ద పోలీసులు అడ్డుకోవటం స్వల్ప ఉదిక్తతకు దారితీసింది.

వైసీపీ నేత‌లు మాత్రం పులిచింత‌ను స‌ద‌ర్శించి వ‌స్తున్నార‌ని, తెలుగుదేశం నేత‌ల‌కు మాత్రం అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని పోలీసుల‌పై టీడీపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. అయినా వారికి అనుమ‌తి లేద‌ని పోలీసులు అడ్డ‌గించారు. పోలీసులను ప్రతిఘటించిన అనంతరం పులిచింతల డ్యామ్ పైకి చేరుకున్న టిడిపి నేతలు,16 వ గేటు, స్టాప్ లాక్ లను ఎట్ట‌కేల‌కు పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments