Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకర్లకు శుభవార్త.. ఇకపై సిటీ రైళ్లు.. కండిషన్ అప్లై...

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (11:58 IST)
దేశ ఆర్థిక రాజధానిలో ప్రధానమైన ప్రజా రవాణా వ్యవస్థ సబర్బన్ రైళ్లు(లోకల్ ట్రైన్స్). ప్రతి నిత్యం కొన్ని లక్షల మంది ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, కరోనా నేపథ్యంలో ఎన్నో రోజులుగా నిలిచిపోయిన లోకల్ రైళ్లు ముంబైలో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 
 
అయితే ఈ రైళ్ళలో ప్రయాణం చేయాలనుకునేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి కావాలి. అది కూడా రెండో డోసు వేసుకుని 15 రోజులు పూర్తయితేనే రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి.
 
రైళ్లలో ప్రయాణం చేయాలని భావించేవారు మాస్క్, శానిటైజర్, వ్యక్తిగత శుభ్రత, స్టేషన్‌లో పాటించాల్సిన నియమాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడి చేసింది. ఈ నెల 12 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక రైలు పాస్ తయారు చేస్తున్నారు. 
 
ఇంకా ఒక ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించనున్నారు. లోకల్ రైళ్ళలో ప్రయాణం చేసే వ్యక్తులు, తమ వ్యాక్సినేషన్ వివరాలను ఆ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాతే లోకల్ రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు. అలాకాకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తే మాత్రం భారీ జరినామా తప్పదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments