Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకర్లకు శుభవార్త.. ఇకపై సిటీ రైళ్లు.. కండిషన్ అప్లై...

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (11:58 IST)
దేశ ఆర్థిక రాజధానిలో ప్రధానమైన ప్రజా రవాణా వ్యవస్థ సబర్బన్ రైళ్లు(లోకల్ ట్రైన్స్). ప్రతి నిత్యం కొన్ని లక్షల మంది ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, కరోనా నేపథ్యంలో ఎన్నో రోజులుగా నిలిచిపోయిన లోకల్ రైళ్లు ముంబైలో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 
 
అయితే ఈ రైళ్ళలో ప్రయాణం చేయాలనుకునేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి కావాలి. అది కూడా రెండో డోసు వేసుకుని 15 రోజులు పూర్తయితేనే రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి.
 
రైళ్లలో ప్రయాణం చేయాలని భావించేవారు మాస్క్, శానిటైజర్, వ్యక్తిగత శుభ్రత, స్టేషన్‌లో పాటించాల్సిన నియమాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడి చేసింది. ఈ నెల 12 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక రైలు పాస్ తయారు చేస్తున్నారు. 
 
ఇంకా ఒక ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించనున్నారు. లోకల్ రైళ్ళలో ప్రయాణం చేసే వ్యక్తులు, తమ వ్యాక్సినేషన్ వివరాలను ఆ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాతే లోకల్ రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు. అలాకాకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తే మాత్రం భారీ జరినామా తప్పదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments